
భారత్తో పాటు చైనా, మలేసియా:
గ్రూప్ 'డి'లో భారత్ పోటీపడనుంది. ఈ గ్రూపులో భారత్తో పాటు మాజీ చాంపియన్ చైనా, మలేసియాలు ఉన్నాయి. ఈ గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో భాగంగా ఒక మ్యాచ్లో.. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ఒక్కో మ్యాచ్ను నిర్వహిస్తారు. 2017 సుదిర్మన్ కప్లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరుకొని చైనా చేతిలో ఓడిపోయింది.

టాప్-5లో సింధు:
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో సింధు మళ్లీ టాప్-5లోకి వచ్చింది. తాజా ర్యాంకింగ్స్లో సింధు ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో ర్యాంకు సాధించింది. సైనా నెహ్వాల్ 9వ ర్యాంకులో కొనసాగుతుంది. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ 8, సమీర్వర్మ 15, సాయి ప్రణీత్ 20వ ర్యాంకులలో కొనసాగుతున్నారు.

జట్లు:
పురుషుల జట్టు:
శ్రీకాంత్, సమీర్ వర్మ (సింగిల్స్).. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి, మనూ అత్రి, ప్రణవ్ చోప్రా (డబుల్స్).
మహిళల జట్టు:
పీవీ సింధు, సైనా నెహ్వాల్ (సింగిల్స్).. నేలకుర్తి సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, మేఘన, పూర్వీషా రామ్ (డబుల్స్).


Click it and Unblock the Notifications












