జపాన్ ఓపెన్లో ముగిసిన భారత పోరు
ఈ మ్యాచ్లో తొలి గేమ్ను 21-19తో సొంతం చేసుకున్న కిదాంబి శ్రీకాంత్కు రెండో గేమ్లో ప్రత్యర్థి లీ డాంగ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రెండో గేమ్ ఆరంభం నుంచీ లీడాంగ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. గేమ్ మధ్యలో శ్రీకాంత్ పుంజుకున్నప్పటికీ, గేమ్ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఇక, నిర్ణయాత్మక మూడో సెట్ హోరా హోరీగా సాగింది.
లీడ్ను కాపాడుకోలేకపోయిన కిదాంబి శ్రీకాంత్
మూడో సెట్ ఆరంభంలో కూడా లీ డాంగ్ ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే, మధ్యలో ప్రత్యర్థిపై పైచేయి సాధించినా శ్రీకాంత్ చివరి వరకు ఆ లీడ్ను కాపాడుకోలేకపోయాడు. దీంతో 18-21తో మూడో సెట్ను కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకున్నాడు. ప్రస్తుతం బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో లీడాంగ్ది 33వ ర్యాంకు కాగా, శ్రీకాంత్ 7వ ర్యాంకులో కొనసాగుతోన్నాడు.
గావో ఫంగ్జీ చేతిలో పీవీ సింధు ఓటమి
ఇక, జపాన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్లోనూ భారత షట్లర్లు ఎవరూ క్వార్టర్స్ను కూడా దాటలేకపోయారు. అంతకముందు జరిగిన ప్రిక్వార్టర్స్లో పీవీ సింధు చైనాకు చెందిన 14 సీడ్ గావో ఫంగ్జీతో జరిగిన ఉమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో 18-21, 19-21 తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఇంటికి
గతేడాది అక్టోబరులో డెన్మార్క్ ఓపెన్లోనూ ఇదే క్రీడాకారిణి చేతిలో సింధు ఓటమి పాలవడం విశేషం. మరో మ్యాచ్లో హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఓటమి పాలయ్యాడు. ఇండోనేసియా బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆంథోని సినిసుకతో జరిగిన మ్యాచ్ను డ్రా చేసుకోవడం ద్వారా జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రణయ్ నిష్క్రమించాడు.