
సునాయాసంగా ఆ గేమ్ను సొంత చేసుకుని ఫలితాన్ని మూడో గేమ్కు తీసుకెళ్లింది. నువ్వానేనా అన్నట్టు సాగిన ఉత్కంఠభరితమైన ఆఖరి గేమ్లో సింధు గెలిచి శుక్రవారం జరిగే క్వార్టర్స్లో చైనాకు చెందిన రెండో సీడ్ లీ జురూయ్తో అమీతుమీ సిద్ధమైంది.
పురుషుల విభాగంలో తలపడిన కశ్యప్, గురుసాయి దత్ ఆధిక్యం కోసం గంటా ఆరు నిమిషాలు పాటు పోరాడారు. చివరికి గురుసాయి 16-21, 21-18, 21-4తో ఎనిమిదో సీడ్ కశ్యప్పై గెలిచి క్వార్టర్స్లో అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగే పోటీలో సాయిదత్ టా ప్ సీడ్ చైనాకు చెందిన చెన్ లాంగ్తో తలపడాల్సి ఉంది.
కాగా, ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల్లో గెలిచిన మరో ఇద్దరు భారత ఆటగాళ్లు సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నారు. సౌరభ్ వర్మ 21-12, 21-16తో చైనీస్ తైపీకి చెందిన జెన్ హో సుపై గెలవగా.. అజయ్ 21-17, 21-9తో డెరె క్ వాంగ్ (సింగపూర్)ను చిత్తు చేశాడు.
అయితే మిక్స్డ్ డబుల్స్లో భారత జోడీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎనిమిదో సీడ్గా బరిలోకి దిగి న అశ్విని పొన్నప్ప, తరుణ్ కోన జోడీ తొలి రౌండ్లోనే ఓటమి చవిచూసింది. ఈ భారత జోడీ 9-21, 14-21తో మలేసియా ద్వయం జియాన్ గువో ఆంగ్, యిన్ లూ లిమ్ చేతిలో ఓటమిపాలైంది.