
పివి సింధు మలేసియా గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ టోర్నీలో ఏకైక భారత ఆశాకిరణం సింధు శుక్రవారం మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీస్లో హైదరాబాదీ 21-17, 21-11 స్కోరుతో మూడోసీడ్ సప్సిరీ టయెరటనచయ్ (థాయ్లాండ్)ను చిత్తుచేసింది. సింధు 34 నిమిషాల్లోనే వరుస గేమ్ల్లో అవలీలగా నెగ్గింది.
సప్సిరీతో సెమీస్ పోరు ఆరంభంలో సింధు వెనకబడింది. తొలిగేమ్లో సప్సిరీ 16-10తో ముందంజ వేసింది. ఈ ద శలో అనూహ్యంగా పుంజుకున్న హైదరాబాదీ వరుసగా 9 పాయింట్లు సాధించి 19-10 ఆధిక్యంలో నిలిచింది.
ఆ తర్వాత ఒకే పాయింట్ కోల్పోయిన సింధు వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలి గేమ్ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్లో సింధు వెనుదిరిగి చూసుకోలేదు. ఆద్యంతం తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది.