For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిరణ్ జెట్ ఫైటర్‌లో ప్రయాణించిన సైనా నెహ్వాల్

By Srinivas
Saina Nehwal
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జెట్ ఫైటర్ విమానం సూర్య కిరణ్-2లో విహరించింది. షూటర్ అభినవ్ బింద్రా తర్వాత జెట్ ఫైటర్‌లో ప్రయాణించిన క్రికటేతర క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ ఖ్యాతికెక్కింది.

లండన్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో సైనా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ పతకం సాధించినందుకు గాను సైనాకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈ అరుదైన అవకాశం కల్పించింది. కాగా సైనాకు ఈ అరుదైన అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

సైనా తమ అకాడమీకి వస్తే యువ పైలెట్లకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అప్పుడు వారు చెప్పారు. కాగా ఈ మధ్యకాలంలో ఎయిర్‌ఫోర్స ప్రతిభావంతులైనన క్రీడాకారులకు గౌరవ ర్యాంకులిచ్చి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. నిరుడు సచిన్ టెండూల్కర్‌కు గౌరవ గ్రూప్ కెప్టెన్ హోదా ఇచ్చిన ఐఏఎఫ్ సచిన్, ధోనీలకు ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎస్‌యు-30ఎంకేఐలో విహరించే అవకాశాన్నిచ్చింది.

లండన్ ఒలంపిక్స్‌లో మహిళ సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో హైదరాబాదీ సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఆమెకు ఆదరణ పెరిగింది. ఇప్పుడు చాలా మందికి ఆమె స్ఫూర్తిదాయకంగా మారారు. ఇటీవలే ఆమె ఓ కంపెనీతో 40 కోట్లరూపాయల డీల్ కూడా కుదుర్చుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+