
ఈ సందర్భంగా సైనా ఎయిర్ఫోర్స్లో ని పలువురు క్రీడాకారులతో బ్యాడ్మింటన్ కూడా ఆడుతుంది. ఈ కిరణ్-ఎంకే-2 జెట్తోనే కొత్త పైలెట్లు విమానం నడపడాన్ని నేర్చుకుంటారు. సైనా తమ అకాడమీకి వస్తే యువ పైలెట్లకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని వారంటున్నారు.
కాగా ఈ మధ్యకాలంలో ఎయిర్ఫోర్స ప్రతిభావంతులైనన క్రీడాకారులకు గౌరవ ర్యాంకులిచ్చి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. నిరుడు సచిన్ టెండూల్కర్కు గౌరవ గ్రూప్ కెప్టెన్ హోదా ఇచ్చిన ఐఏఎఫ్ సచిన్, ధోనీలకు ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఎస్యు-30ఎంకేఐలో విహరించే అవకాశాన్నిచ్చింది.
లండన్ ఒలంపిక్స్లో మహిళ సింగిల్స్ బ్యాడ్మింటన్లో హైదరాబాదీ సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఆమెకు ఆదరణ పెరిగింది. ఇప్పుడు చాలా మందికి ఆమె స్ఫూర్తిదాయకంగా మారారు. ఇటీవలే ఆమె ఓ కంపెనీతో 40 కోట్ల రూపాయల డీల్ కూడా కుదుర్చుకుంది.