
సైనా నెహ్వాల్తో తాను డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అతను ఒ పత్రికతో అన్నాడు. తామిద్దరం మంచి మిత్రులమని, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని కశ్యప్ చెప్పాడు. నిజాయితీగా చెబుతున్నానని, తమ గురించి వస్తున్నవన్నీ జోకులూ వదంతులేనని అతను అన్నాడు. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని అతను అన్నాడు.
ఒలింపిక్స్లో ప్రదర్శన, అర్జున అవార్డును అందుకోవడం తనకు ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టాయని కశ్యప్ అన్నాడు. ఒలింపిక్స్లో పతకాలు గెలుచుకున్నవారినే సన్మానించడం, మిగతా వారిని నిర్లక్ష్యం చేయడం తనకు బాధ కలిగించిందని కశ్యప్ చెప్పాడు.
సైనా నుంచి తాను స్ఫూర్తి పొందానని చెప్పాడు. హైదరాబాదీలు అయిన సైనా, కశ్యప్ నగరంలోని గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. లండన్ ఒలింపిక్స్లో సైనా కాంస్యం సాధించగా, కశ్యప్ క్వార్టర్స్ దాకా ఆడాడు. ఇటీవల అర్జున అవార్డు పొందిన 25 ఏళ్ల కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఇప్పట్లో పెళ్లి చేసుకునే యోచన లేదు. ప్రస్తుతం ఆటపైనే దృష్టిసారిస్తున్నా. ప్రేమ, పెళ్లి వార్తలన్నీ అబద్ధమే' అన్నాడు.