
కోర్ట్ మొత్తం కలియ తిరుగుతూ గుయెన్ను గడగడలాడించడమే కాకుండా... మెరుపు వేగంతో షాట్లను ఆడాడు. తోలి గేమ్ను సులువుగా గెలిచిన కశ్యప్కు రెండో గేమ్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఈ విజయంతో గ్రూడ్ డిలో తొలి స్దానం సాధించిన ఒలింపిక్ పతకం దిశగా మరో అడుగు ముందుకేశాడు. 25 సంవత్సరాలు వయసు కలిగిన పారుపల్లి కశ్యప్కు ఇది రెండవ విజయం బెల్జియంకు చెందిన టన్ యుహన్తో జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో పారుపల్లి కశ్యప్ తన మొదటి గెలుపుని నమోదు చేశాడు.
తొలిగేమ్లో ప్రత్యర్థిపై మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన పారుపల్లి కశ్యప్ 21-14, 21-12 పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. తొలి సెట్లో కాస్త తడబడినా రెడో సెట్ను సునాయాసంగా కైవసం చేసుకోవడం విజయం సాధించాడు. ఫలితంగా లండన్ ఒలింపిక్స్లో కశ్యప్ భారత్కు తొలి విజయాన్ని అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా నిలిచాడు.
తెలుగు వన్ఇండియా