
ఇటీవల ముగిసిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సందర్భంగా క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ తరఫున గుత్తా జ్వాల సారథిగా వ్యవహరించారు. ఈ సమయంలో ఆమె బంగా బీట్స్తో జరిగిన మ్యాచ్లో ఆడరాదంటూ తమ జట్టు క్రీడాకారులు కొందరిని జ్వాల రెచ్చగొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.
గత నెల 25న జరిగిన ఈ మ్యాచ్లో ఆటగాడిని మార్చే విషయంలో వివాదం నెలకొంది. బంగా బీట్స్ షట్లర్ హు యున్ గాయపడటంతో అతని స్థానంలో జోర్గెన్సెన్ను బరిలోకి దించేందుకు ఐబిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనుమతిచ్చింది. ఈ మార్పును ఢిల్లీ షట్లర్లు వ్యతిరేకిస్తూ మ్యాచ్ ఆడబోమని హెచ్చరించారు.
దీంతో బంగా జోర్గెన్సెన్ను ఆడించకుండా అరవింద్ భట్ను బరిలోకి దింపింది. ఈ విషయంపై జ్వాలకు ఇదివరకే షోకాజ్ నోటీసు పంపారు. 14 రోజుల్లోగా సమాధానమివ్వాలని జ్వాలకు గడువు విధించినట్టు బాయ్ ప్రతినిధి ఒకరు చెప్పారు.