వరుస గేములలో గెలుపు:
మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ సింధు 21-13, 21-19తో డెన్మార్క్ కి చెందిన మియా బ్లిఫెల్డ్ ట్ పై గెలుపొందింది. 39 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో మియాను వరుస గేములలో ఓడించింది. మొదటి గేమ్ లో సింధు సునాయాసంగా గెలిచినా.. రెండో గేమ్ లో మాత్రం ప్రతిఘటన ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సింధు చైనాకి చెందిన కాయీ యాన్యాన్ తో తలపడుతుంది.
ఒకుహారాతో సైనా అమితుమీ:
మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ సైనా నెహ్వాల్ 21-16, 18-21, 21-19తో పోర్న్ పావీ చోచువాంగ్ ( థాయిలాండ్ )పై విజయం సాధించింది. గత వారం ముగిసిన మలేసియా ఓపెన్ మొదటి రౌండ్ లోనే సైనాను చోచువాంగ్ ఓడించింది. క్వార్టర్స్లో జపాన్ కి చెందిన నొజోమీ ఒకుహారాతో సైనా అమితుమీ తేల్చుకోనుంది.
శ్రీకాంత్, సమీర్ ముందంజ:
పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ 21-12, 23-21తో క్రిస్టియన్ విట్టింగస్ (డెన్మార్క్)ను మట్టికరిపించాడు. 41 నిమిషాల పాటు ఈ మ్యాచ్లో విట్టింగస్ వరుస గేములలో కంగుతిన్నాడు. సమీర్ వర్మ చైనా ఆటగాడు లు గ్వాంగ్జూని 21-15,21-18తో చిత్తు చేశాడు. క్వార్టర్ ఫైనల్స్ లో రెండో సీడ్ తైపీ క్రీడాకారుడు చౌ తియాన్ చెన్ తో కానీ, డెన్మార్క్ కి చెందిన జాన్ ఓ జోర్గెన్సన్ తో కానీ తలపడనున్నాడు.
కశ్యప్ ఓటమి:
పారుపల్లి కశ్యప్ 15-21, 21-16, 22-20తో చైనా క్రీడాకారుడు చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. 71 నిమిషాలు పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో కశ్యప్ ఓటమిపాలయ్యాడు.