
సునాయాస విజయం:
మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సింధు సునాయాస విజయం అందుకుంది. సింధు 21-9, 21-7తో లియాని అలెసండ్ర మయినకిని (ఇండోనేసియా) ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 27 నిమిషాల్లోనే ముగిసింది. సైనా 21-16, 21-11తో యులియా యుసెఫిన్ సుశాంటో (ఇండోనేసియా)పై విజయం అందుకుంది.

సాయి ప్రణీత్ ఓటమి:
పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ 21-17, 21-18తో సితికోమ్ తమసిన్ (థాయ్లాండ్)ను మట్టికరిపించాడు. ప్రణయ్ 11-21, 21-16, 21-18తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై.. సమీర్ వర్మ 21-14, 21-6తో సుపన్యు అవిహింగ్సనన్ (థాయ్లాండ్)పై.. పారుపల్లి కశ్యప్ 21-19, 21-14తో రస్ముస్ గెమ్కే (డెన్మార్క్)పై విజయం సాధించారు. సాయి ప్రణీత్ 21-19, 14-21, 20-22తో మొమొటా చేతిలో ఓటమిని చవిచూసాడు.

డబుల్స్లోనూ మిశ్రమ ఫలితాలే:
పురుషుల డబుల్స్లో మను అత్రి-సుమిత్ రెడ్డి జంట 13-21, 17-21తో డానీ క్రిస్నంటా-కియన్ హీన్ (సింగపూర్) ద్వయం చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి-ప్రణవ్ చోప్రా జంట 21-18, 21-7తో మనీష-అర్జున్ జోడీపై (భారత్) గెలుపొందింది. సౌరభ్ శర్మ-అనుష్క పారిఖ్ జోడీ 12-21, 12-21తో డెచపొల్ పువరనుక్రొ-తెరతనచయ్ (థాయ్లాండ్) జంట చేతిలో మట్టికరిచింది.


Click it and Unblock the Notifications












