హైదరాబాద్: హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నీ భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జపాన్ అగ్రశ్రేణి క్రీడాకారిణి అకానె యమగూచితో 19-21, 12-21 తేడాతో సింధు నెగ్గింది.
మ్యాచ్ ఆరంభం నుంచి సింధు దూకుడుగా ఆండింది. తొలి గేమ్లో ప్రత్యర్థి పుంజుకోవడానికి సింధు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో 21-12తో తొలి గేమ్ను సొంతం చేసుకుంది. ఇక, రెండో గేమ్ మాత్రం ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగింది.
#HongKongOpen2017
— Sports India (@SportsIndia3) November 24, 2017
Brilliant @Pvsindhu1 Storm into SF after a Superb Victory over world no. 2 Akane Yamaguchi 21-12, 21-19. @OGQ_India
go 🇮🇳 pic.twitter.com/pvMeoTH7vp
ఉత్కంఠగా సాగిన ఈ గేమ్ను సింధు 21-19తో సొంతం చేసుకుని మ్యాచ్ని కూడా సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు వీరిద్దరూ ఆరు సార్లు తలపడగా చెరో మూడు మ్యాచ్లు గెలిచారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్లో యమగూచి చేతిలో సింధు ఓడిపోయిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.