
హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధుకు మంచి అవకాశం లభించింది. పీబీఎల్ (ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్) కొద్ది రోజుల ముందే షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్పై మరో బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్, జాతీయ కోచ్ పుల్లెల గోపీ చంద్, అశ్విని పొన్నప్ప తదితర ప్రముఖులు అంతా స్పందించారు.
అయితే తాజాగా పీవీ సింధుకు ఓ సదవకాశం లభించింది. అదేంటంటే సింధూనే ఎంచుకుని మ్యాచ్లు ఆడనుంది. తద్వారా చక్కటి ఫిట్ నెస్తో ఆడొచ్చంటూ మీడియాతో ముచ్చటించింది. వరుసగా స్టార్ ప్లేయర్లే ఆడుకుంటూ పోతే కొత్త టాలెంట్ బయటికి రావడానికి అవకాశం ఎక్కడుంటుందని ప్రశ్నించింది. ఇలా వరుసాగ జరుగుతున్న మ్యాచ్లలో పాల్గొని కొత్త వారు తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చింది.
2018లో జరగనున్న టోర్నమెంట్కి గాను ఆమె సిద్ధంగా ఉన్నానని తెలిపింది. దుబాయ్ సిరీస్ ఫైనల్స్లో చాలా వరకు కష్టపడ్డానని కానీ, ప్రత్యర్థి బలం, సమయం అనుకూలించకపోవడంతో రజితంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది. కొత్త టాలెంట్ను గుర్తు చేస్తూ కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సాయి ప్రణీత్ వీరు చాలా బాగా రాణిస్తున్నారని తెలిపింది. ఇలా అశకాశాలు సృష్టిస్తే మరింత మంది వెలుగులోకి వస్తారని పేర్కొంది.
డిసెంబరు 23న అస్సాంలోని గౌహతి వేదికగా చెన్నై స్మాషర్స్ తన ప్రత్యర్థి అవాధె వారియర్స్తో తలపడనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.