
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంతో మంది యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా సిద్ధార్ద్ ప్రతాప్ సింగ్ స్వీడిష్ ఓపెన్ 2018 విజేతగా నిలిచాడు. సోమవారం (జనవరి 22) జరిగిన ఫైనల్లో డెన్మార్క్కు చెందిన క్రిస్టోపర్సన్పై 21-15, 21-11 తేడాతో విజయం సాధించాడు.
గతేడాదిగా భారత బ్యాడ్మింటన్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న సిద్ధార్ద్ ప్రతాప్ సింగ్ తాజా విజయంతో భారత్కు మరో టైటిల్ అందించాడు. అంతేకాదు భారత్ బ్యాడ్మింటన్లో ఇప్పుడిప్పుడే కొత్త టాలెంట్ వృద్ధి చెందుతోంది. గతేడాది జరిగిన టాటా ఓపెన్లో కూడా సిద్ధార్ద్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.