
హైదరాబాద్: హొ చిన్ మిన్ సిటీ వేదికగా జరుగుతున్న వియత్నాం ఓపెన్ టూర్ 100 టోర్నీ భారత షట్లర్ అజయ్ జయరాం ఫైనల్కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జయరాం 21-14, 21-19 యు ఇగర్షి(జపాన్)పై విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లాడు.
ఆదివారం జరిగే పురుషుల ఫైనల్స్లో జయరాం ఇండోనేషియాకు చెందిన రుస్తావితోతో తలపడనున్నాడు. 38 నిమిషాల పాటు జరిగిన పోరులో జయరాం అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి గేమ్లో 21-14తో కైవసం చేసుకున్న జయరాం ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
ఇక, రెండో గేమ్ ఇద్దరి మధ్య ఆసక్తికరంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ గేమ్లో ఇద్దరూ పాయింట్ల కోసం పోటీపడ్డారు. కానీ చివరకు తన అనుభవాన్ని ఉపయోగించి రెండో గేమ్ను సొంతం చేసుకోవడంతో పాటు మ్యాచ్లో విజయంతో ఫైనల్కు దూసుకెళ్లాడు.
మరో ఆటగాడు మిథున్ సెమీస్లో పరాజయం పాలయ్యాడు. సెమీఫైనల్లో మిథున్ 17-21, 21-19, 14-21తో రుస్తావితో(ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలయ్యాడు.