హైదరాబాద్: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 సిరిస్ నుంచి భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తప్పుకుంది. జీర్ణాశయంలో ఇబ్బందులతో గతవారం స్విస్ ఓపెన్ నుంచి అర్ధంతరంగా వైదొలగిన సైనా.. తాజాగా స్వదేశంలో జరిగే ఇండియా ఓపెన్కూ దూరమైంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఆసుపత్రిలో చేరిన సైనా జీర్ణాశయ సంబంధ సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ సమస్య నుంచి తాను పూర్తిగా కోలుకోకపోవడంతో ఇండియా ఓపెన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) అధికారులకు సైనా సమాచారమిచ్చింది.
"ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ నుంచి సైనా సరిగా లేదు. కడుపు నొప్పితో టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని చెబుతూ ఆమె మాకు లేఖ రాసింది" అని భారత బ్యాడ్మింటన్ సంఘం అధికారి ఒకరు వెల్లడించారు. ఇండియా ఓపెన్ మార్చి 26(మంగళవారం) మొదలుకానుంది.
సైనా నిష్క్రమణతో ఇక పీవీ సింధు ఇండియా ఓపెన్లో మహిళల సింగిల్స్ బరిలో నిలిచిన ఏకైక భారత షట్లర్. సైనా నెహ్వాల్ 2015లో ఇండియా ఓపెన్ విజేతగా నిలిచింది.