హైదరాబాద్: మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. టోర్నీలో భాగంగా మంగళవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ 21-12, 21-16తో యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)పై విజయం సాధించింది.
ఇటీవల గోల్డ్కోస్ట్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గి చక్కటి ఫామ్లో ఉన్న సైనా నెహ్వాల్ 42 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించడం విశేషం. ఇక, టోర్నీలో భాగంగా రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ రెండో సీడ్ యమగూచి (జపాన్) రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ తొలిరౌండ్లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సమీర్ 13-21, 15-21తో టామీ సుగియార్తో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ కపూర్-కుహు గార్గ్ జంట తొలి రౌండ్లో 9-21, 10-21తో జితింగ్-డూ యీ (చైనా) చేతిలో ఓడిపోయింది.