హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్ (28), పారుపల్లి కశ్యప్ (32) ఇంట పెళ్లి సందడి మొదలైంది. వీరి పెళ్లి చాలా సాదాసీదాగా జరగనున్నట్లు తెలుస్తోంది.బంధువులు, శ్రేయోభిలాషుల రాకతో సైనా, కశ్యప్ల గృహాలు సందడిగా మారాయి. ఇప్పటికే వివాహ విందు ఆహ్వాన పత్రాల్ని ప్రముఖులందరికి సైనా, కశ్యప్లు అందజేశారు. శుక్రవారం (డిసెంబర్ 14) వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు బ్యాడ్మింటన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అటు కశ్యప్ ఇంట సాంప్రదాయకబద్ధంగా జరగనున్న పెళ్లికి ఇప్పటికే ఏర్పాట్లు మొదలైయ్యాయి.
పెళ్లికి ముందు నిర్వహించే ఒడుకు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం ఉదయం కశ్యప్కు ఉపనయనంతో పెళ్లి తంతు మొదలయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రిజిస్టర్ మ్యారేజీ ద్వారా సైనా, కశ్యప్ ఒక్కటవుతారు. ఇరువురి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది. అదే రోజు సాయంత్రం దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం కశ్యప్ ఇంట్లో పూజా కార్యక్రమం ఉంటుందని బ్యాడ్మింటన్ వర్గాలు తెలిపాయి.
పెళ్లి బంధంతో ఒక్కటవుతున్న సైనా, కశ్యప్.. ఆదివారం (డిసెంబర్ 16) సాయంత్రం గ్రాండ్గా విందును ఇవ్వనున్నారు. దీనికి క్రీడా రంగానికి చెందిన ప్రముఖులతో పాటు సినీ, రాజకీయ రంగాల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. వీరి వివాహ విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బ్యాడ్మింటన్ క్రీడతో బంధం అల్లుకున్న సైనా, కశ్యప్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వారంతట వారే ఈ విషయాన్ని వెల్లడించి పెళ్లి తేదీని కూడా ప్రకటించారు. ఇరు కుటుంబాల పెద్దల ఆమోదంతోనే పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని వారే వెల్లడించారు.
View this post on InstagramA post shared by Parupalli Kashyap (@parupallikashyap) on