హైదరాబాద్: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ డేటింగ్లో ఉన్నారంటూ గతంలో ఎన్నోసార్లు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ డేటింగ్ రూమర్లను పెళ్లితో నిజం చేయాలని అభిమానులు కోరుతున్నారు.
అసలేం జరిగింది?
ఇటీవల హైదరాబాద్లోని ఓ రెస్టారెంట్లో పారుపల్లి కశ్య్పతో కలిసి దిగిన ఫొటోను సైనా నెహ్వాల్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో కాస్త వైరల్గా మారింది. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
దీంతో సైనా తన ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేసిన ఫోటోపై నెటిజన్లు కామెంట్లు ఈ విధంగా కామెంట్లు పెట్టారు. 'ఇద్దరిదీ పర్ఫెక్ట్ జోడీ' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా 'చూడ్డానికి చక్కగా ఉన్నారు.. డేటింగ్ వార్తలను నిజం చేయండి.. ప్లీజ్' అంటూ మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు.
'ఇప్పటికే బ్యాడ్మింటన్లో చాలామంది జంటలుగా మారారు, మీరూ వాళ్లను అనుసరించండి' అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టాడు.
Happy birthday to #fatpigeon 👏👌👍 ..... photo credit to @gurusaidutt 😘
A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on