గోపీచంద్ అకాడమీలో శిక్షణ సమయంలోనే
వీరి వివాహానికి సంబంధించిన ఓ పెళ్లిపత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ ప్రముఖ హోటల్ వేదికగా వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. 2005 నుంచి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకొంటున్న సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని సైనా ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
|
ఇన్నాళ్లు వాయిదా వేయడానికి కారణం:
కెరీర్ కోసం వివాహాన్ని ఇన్నాళ్లూ వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు ఎప్పుడూ చెప్పలేదని, వాళ్లే దాన్ని పసిగట్టేశారని చెప్పారు ఈ మాజీ నంబర్ వన్.
ఎవరితో సన్నిహితంగా ఉంటున్నానో వారే
‘వారికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మేమిద్దరం, మా తల్లిదండ్రులతో కలిసి అనేక సార్లు ప్రయాణం చేశాం. ఆ సమయంలో నేను ఎవరితో సన్నిహితంగా ఉంటున్నానో వారు అర్థం చేసుకున్నారు' అని సైనా చెప్పుకొచ్చారు. వివాహం అనంతరం సైనా డిసెంబర్ 22నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో పాల్గొననున్నారు. ఈ లీగ్లో ఆమె నార్త్ ఈస్టర్న్ వారియర్స్కు ఆడనున్నారు.