తొలి గేమ్ గెలిచి రెండో గేమ్లోనూ
ఈ క్రమంలో జపాన్ అమ్మాయి 21-12తో తొలి గేమ్ గెలిచి రెండో గేమ్లోనూ 4-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో సైనా అనూహ్యంగా పుంజుకుంది. క్రాస్కోర్టు షాట్లు, స్మాష్లతో విరుచుకుపడిన ఈ హైదరాబాదీ స్టార్ 4-4తో స్కోరు సమం చేయడమేకాక.. ఆ తర్వాత 10-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరు కొనసాగిస్తూ 21-14తో గేమ్ గెలిచిన సైనా.. మ్యాచ్లో నిలిచింది.
ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్తో అమీతుమీ
మూడో గేమ్ ఆరంభంలోనూ అదే స్థాయి పోరాటంతో సాగింది. కానీ నెట్గేమ్తో అదరగొట్టిన సైనా 9-5తో ఆధిక్యంలోకి వెళ్లడమేకాక అదే ఊపు కొనసాగిస్తూ 21-17తో గేమ్తో పాటు మ్యాచ్ గెలుచుకుంది. క్వార్టర్స్లో సైనా.. ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇటీవల డెన్మార్క్ ఓపెన్ ఫైనల్లో తైజు చేతిలోనే నెహ్వాల్ ఓడింది. మరోవైపు పి.వి.సింధు అలవోక విజయంతో ముందంజ వేసింది.
తనదైన దూకుడుని ప్రదర్శించిన సింధు
ప్రిక్వార్టర్స్లో ఆమె 21-17, 21-16తో సయాక సాటొ (జపాన్)ను ఓడించింది. ఈ మ్యాచ్లో తొలి గేమ్లో మాత్రమే ప్రత్యర్థి నుంచి సింధుకు పోటీ ఎదురైంది. అయినా తొలి గేమ్ను 21-17తో గెలుచుకుని.. రెండో గేమ్లోనూ ఆధిపత్యం చెలాయించింది. ఈ క్రమంలో తన ట్రేడ్మార్క్ స్మాష్లు కొట్టి.. 21-16తో మ్యాచ్ను గెలుచుకుంది. పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీకాంత్ ముందంజ వేశాడు.
ఒత్తిడిలోనూ గొప్పగా ఆడిన కిదాంబి
ప్రిక్వార్టర్స్లో అతను 12-21, 21-16, 21-18తో లీ డాంగ్ కీన్ (కొరియా)పై చెమటోడ్చి గెలిచాడు. తొలి గేమ్ను 12-21తో అనూహ్యంగా కోల్పోయిన శ్రీకాంత్.. రెండో గేమ్లో పుంజుకున్నాడు. ఆరంభంలో 5-6తో నిలిచిన అతను.. ఆ తర్వాత 13-8తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ ఒత్తిడిలోనూ గొప్పగా ఆడిన కిదాంబి.. వరుస పాయింట్లు గెలిచి 21-18తో గేమ్తో పాటు మ్యాచ్ దక్కించుకున్నాడు.
మహిళల.. పురుషుల డబుల్స్లో:
మహిళల డబుల్స్లో మేఘన-పూర్వీషా రామ్ ప్రిక్వార్టర్స్లో ఓడిపోయారు. మేఘన జోడీ 15-21, 13-21తో గ్రేసియా-అప్రియాని (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ 21-13, 21-19తో ప్రపంచ 16వ ర్యాంకు జోడీ హి జిటింగ్-కియాంగ్ (చైనా)కు షాకిచ్చింది.