హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెమీస్లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. ఎన్నో ఆశల మధ్య సెమీస్లోకి అడుగుపెట్టిన సైనా తొలి గేమ్లో దూకుడు ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిగేమ్లో జపాన్ షట్లర్ ఒకుహరపై 21-12 తేడాతో సైనా గెలుపొందింది.
ఆ తర్వాత వరుస గేముల్లో 17-21, 10-21తో వరుస గేముల్లో ఓటమి పాలైంది. తొలుత రెండో గేమ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఒకానొక సమయంలో ఇద్దరూ సమానమైనప్పటికీ చివరికి ఒకుహరనేపై చేయిగా నిలిచి 21-17 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో ఒకుహర మొదటి నుంచీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మూడో గేమ్లో సైనాపై 21-10 పాయింట్లతో ఒకుహర విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్మార్పై విజయం సాధించి సెమీస్లోకి అడుగుపెట్టిన సైనా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
2015 - 🥈
— BAI Media (@BAI_Media) August 26, 2017
2017 - 🥉
Saina Nehwal shines at the Worlds again. Her #2017BWC campaign comes to an end but not before she earns a medal for 🇮🇳 pic.twitter.com/YuTFToFeyR