న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలేసియా ఓపెన్: మారిన్ చేతిలో ఓడిన సైనా, టోర్నీ నుంచి నిష్క్రమణ

Saina Nehwal crashes out after losing to Carolina Marin

హైదరాబాద్: కౌలలాంపూర్ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో 16-21, 13-21 తేడాతో కరోలినా మారిన్ చేతిలో ఓడిన సైనా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తొలి గేమ్‌లో 1-4తో వెనుకబడిన మారిన్.. ఆ తర్వాత ఒక్కో పాయింటే గెలుస్తూ సైనాను సమీపించింది. ఒకానోక దశలో వీరిద్దరూ 14-14 పాయింట్లతో సమం అయ్యారు. ఈ సమయంలో వరుసగా 6 పాయింట్లు సాధించిన కరోలినా మారిన్ ఆధిక్యంలో దూసుకెళ్లడంతో పాటు 16-21తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.

ఇక, రెండో గేమ్‌లోనూ సైనా పుంజుకోలేక పోయింది. దూకుడుగా ఆడిన మారిన్ రెండో గేమ్‌ను కూడా 21-13 తేడాతో గెలుపొందింది. 40 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన కరోలినా మారిన్.. సైనాకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు.

తాజా ఓటమితో సైనా-మారిన్ ముఖాముఖి పోరు 5-6గా ఉంది. 2017లో మలేషియా ఓపెన్ టైటిల్ గెలిచిన సైనా.. 2011లో రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో ఏడో సీడ్‌గా బరిలో దిగిన సైనా 21-18, 23-21 తేడాతో జపాన్‌కు చెందిన రెండో సీడ్ నొజొమి ఒకుహరను ఓడించి సెమీస్ చేరింది.

క్వార్టర్స్‌లో అద్భుత ఆటతీరు కనబర్చిన సైనా.. సెమీస్‌లో ఆ స్థాయి ఆటతీరును కనబర్చలేక ఓడిపోయింది. ఇక, శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో కొరియాకు చెందిన సాన్ వాన్ చేతిలో ఓడిన కిదాంబి శ్రీకాంత్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, January 19, 2019, 13:19 [IST]
Other articles published on Jan 19, 2019
Read in English: Saina Nehwal crashes out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X