చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్టూర్ సూపర్-1000 టోర్నీలో భారత పోరాటం ముగిసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత షట్లర్ సాయి ప్రణీత్ కార్టర్ ఫైనల్లో ఓటమిని ఎదుర్కొన్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ కార్టర్ ఫైనల్లో సాయి ప్రణీత్ 21-16, 6-21, 16-21 తేడాతో ఆంటోని సినిసుకా గింటిక్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు.
మరోసారి అఫ్రిది అక్కసు.. శ్రీలంక క్రికెటర్లపై ఐపీఎల్ ఒత్తిడి ఉంది!!
తొలి గేమ్లో మంచి ప్రదర్శన చేసిన సాయి ప్రణీత్.. మిగతా రెండు గేమ్ల్లో ఓడిపోయి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి గేమ్లో ప్రణీత్ అద్భుత ఆట ముందు గింటిక్ తలొంచాడు. రెండో గేమ్లో అద్భుతంగా పుంజుకున్న గింటిక్.. ప్రణీత్కు అసలు అవకాశమే ఇవ్వలేదు. వరుస పాయింట్లు సాధిస్తూ ప్రణీత్పై ఒత్తిడి పెంచాడు.దీంతో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లి గేమ్ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో గింటిక్ ఆరంభంలోనే పైచేయి సాధించాడు. ప్రణీత్ను 2-6తో వెనక్కి నెట్టిన గింటిక్.. అదే జోరును చివరి వరకు కొనసాగించాడు. అయితే మధ్యలో ప్రణీత్ పోరాడినా.. ఓటమిని నుండి తప్పించుకోలేకపోయాడు.
క్వార్టర్ ఫైనల్స్లో సాయి ప్రణీత్ ఓటమితో చైనా ఓపెన్ సింగిల్స్ ఈవెంట్లో భారత్ పోరాటం ముగిసింది. కనీసం ఒక్క పతకం కూడా సాధించకుండానే భారత ఆటగాళ్ల నిరాశగా వెనుదిరిగారు. సైనా నెహ్వాల్ పూర్తిగా నిరాశపరచగా.. పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ మోస్తరు ప్రదర్శన చేశారు. తొలి రౌండ్లో థాయ్లాండ్కు చెందిన క్రీడాకారిణి, ప్రపంచ 19వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్ 10-21, 17-21తో సైనా నెహ్వాల్ను వరుస గేమ్లలో ఓడించింది.