హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత, స్టార్ షట్లర్ పీవీ సింధుతో అరుదైన ఆహ్వానం లభించింది. మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే యువ దసరా కార్యక్రమంలో పాల్గొనాలని ఆమెను కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించింది. యువ దసరాను అక్టోబర్ 1న కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించనుంది.
పాక్ టూర్ను లంక ఆటగాళ్లు బహిష్కరించడానికి కారణం భారతే!!
ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రావాలంటూ పీవీ సింధుకు ఆహ్వానం పంపినట్లు మైసూర్ జిల్లా మంత్రి వి.సోమన్న తెలిపారు. యువ దసరా లేదా దసరా స్పోర్ట్స్లో భాగంగా వైట్ వాటర్ రాఫ్టింగ్, మడ్ కార్టింగ్, కయాకింగ్, చాముండి హిల్ ట్రైల్ తదితర పోటీలను నిర్వహించనున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి యడియురప్పతో కలిసి ఈ కార్యక్రమాన్ని సింధు ప్రారంభించనుంది. ఇటీవలే జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పీవీ సింధు స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21-7, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది.
మరింత పదిలం: టెస్టు ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్ను అందుకునే వాడే లేడా?
సింధు కేవలం 38 నిమిషాల్లో ఒకుహారాను మట్టికరిపించింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డుల్లోకి ఎక్కింది.