హైదరాబాద్: రియో ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు హాంకాంగ్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో సింగపూర్ క్రీడాకారిణి షియాయు లియాంగ్పై సింధు విజయం సాధించి సెమీస్లోకి దూసుకెళ్లింది.
మూడు గేమ్స్లో వరుసగా 21-17, 21-23, 21-18 స్కోరుతో లియాంగ్ పై విజయం సాధించింది. తొలి గేమ్లో దూకుడుగా ఆడిన సింధు, రెండో గేమ్లో హోరాహోరీగా సాగింది. దీంతో 21-23 స్కోరుతో రెండో సింధు ఓటమి పాలైంది. ఇక విజేతను నిర్ణయించే మూడో గేమ్ సైతం ఉత్కంఠగా సాగింది.
మూడో గేమ్లో ఒకానొక దశలో సింధు వెనుకబడినా, ఆ తర్వాత వరుసగా 7 పాయింట్లు సాధించి లియాంగ్పై విజయం సాధించి సెమీ ఫైనల్లోకి చేరింది. దీంతో హాంకాంగ్ ఓపెన్ టైటిల్కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. మరో క్వార్టర్ మ్యాచ్లో సైనా నెహ్వాల్... చైనా ప్లేయర్ యి చెంగ్ తో తలపడుతుంది.
ఈ మ్యాచ్లో గనుక సైనా నెహ్వాల్ గెలిస్తే సెమీస్లో సింధుతో తలపడాల్సి ఉంటుంది. ఇక పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో స్విస్ ఓపెన్ విజేత హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి పాలయ్యాడు. మలేసియా షట్లర్ వీ ఫెంగ్ చాంగ్ చేతిలో 15-21, 21-11, 21-15తో పరాజయం పాలయ్యాడు.