
సింధు
ఇలాంటి వ్యక్తి సిబ్బందిగా ఉంటే ఇండిగో ఎయిర్లైన్స్ ఖ్యాతి దెబ్బతింటుందని సింధు ట్విట్టర్లో పేర్కొంది. పీవీ సింధు ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఇండిగో ఎయిర్ లైన్స్ వెంటనే స్పందించింది. సింధు ఆరోపణల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. సింధు అధిక లగేజీతో ప్రయాణానికి సిద్ధమయ్యారని చెప్పింది.

తమ సిబ్బంది ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదు
ప్రయాణికులు పట్ల తమ సిబ్బంది మర్యాదగానే నడుచుకున్నారని ఇండిగో ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ సిబ్బంది ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదని స్పష్టం చేసింది. కేవలం విధుల ప్రకారమే నడుచుకున్నారని ఎయిర్ లైన్స్ తెలిపింది.

లగేజీ విషయంలో సింధుతో చిన్నపాటి వివాదం
లగేజీ విషయంలో విమానంలో సింధుతో చిన్న వివాదం చెలరేగిందని.. తాను అధిక బరువు ఉన్న లగేజీని తీసుకురావడం వల్ల అది బిన్లో పట్టలేదని, అందుకే సింధుకు విషయం తెలియజేసి దానిని కార్గోకు మారుస్తామని తమ సిబ్బంది కోరగా సింధు తొలుత అంగీకరించలేదని ఎయిర్లైన్స్ పేర్కొంది.

ఏ కస్టమర్కైనా అవే నిబంధనలు ఫాలో అవుతాం
ఆ తర్వాత సింధు తన లగేజీని కార్గోకు తరలించడానికి ఒప్పుకున్నదని ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. ఏ కస్టమర్కైనా తాము అవే నిబంధనలు ఫాలో అవుతామని ఇండిగో ఎయిర్లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.


Click it and Unblock the Notifications