హైదరాబాద్: బ్యాడ్మింటన్ రాణులు పీవి సింధు, సైనా నెహ్వాల్ మధ్య అంత సఖ్యత ఉన్నట్లు లేదు. మీరిద్దరి మధ్య సంబంధం ఎలా ఉంటుందని పీవి సింధును ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో అడిగితే 'మేము హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అని చెప్పుకునే స్నేహమే కాని అందకు మించిన స్నేహమేమి కాదు' అని తేల్చి చెప్పేసింది.
ఒలింపిక్ రజత పతక పిజేత అయిన సింధు కూర్చుని కబుర్లు చెప్పే అంత అవసరం సైనా నెహ్వాల్తో తనకు లేదు అంటుంది. మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు కలిసే ఆడతాం. కానీ, ట్రైనింగ్ పూర్యయ్యాక ఎవరి దారి వారిదే అని వ్యాఖ్యానించింది.
'మీరిద్దరి మధ్య పోటీ, భేదభావాలు ఏమైనా ఉంటాయా అని అడిగిన దానికి ఖచ్చితంగా ఉంటాయ్. ఎందుకంటే మేమిద్దరం ప్రత్యర్థులం. ఒకే కోర్టులో ఇద్దరూ గెలవడానికే ప్రయత్నిస్తుంటాం. అందుకని అదే భావనను మేము ప్రాక్టీస్ లోనూ కొనసాగిస్తాం.' అని తీసి పడేసింది.
ఆడేందుకు పోటీ, భేదభావాలు ఖచ్చితంగా ఉండాలి. వీటిని చూసి ఎవరో ఏదో అనుకుంటే మనకేంటి. ప్రదర్శన బాగుండాలనే తపనతోనే ఆడాలి అని హితవు పలికింది.
సైనా నెహ్వాల్ మూడు సంవత్సరాలు ఒలింపలియన్ విమల్ కుమార్ వద్ద శిక్షణ అనంతరం మళ్లీ తిరిగొచ్చి గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న విషయం విదితమే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.