హైదరాబాద్: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరిస్ నుంచి పీవీ సింధు నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో కరోలినా మారిన్ చేతిలో 11-21, 15-21 తేడాతో సింధు ఓటమి పాలైంది.
దీంతో మారిన్ సెమీ ఫైనల్స్కు చేరుకోగా, సింధు టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ ఇద్దరూ చివరిసారిగా ఇండియా ఓపెన్లో తలపడగా ఆ మ్యాచ్లో పీవీ సింధు వరుస సెట్లలో మారిన్పై విజయం సాధించింది.