
కొన్నాళ్లుగా టైటిల్ పోరులో చతికిలపడ్డ సింధు
2016 ఏడాదికిగాను చైనా ఓపెన్ గెలిచి సంచలనం సృష్టించిన సింధు కొన్నాళ్లుగా టైటిల్ పోరులో చతికిలపడుతుంది. దీంతో ఈ టోర్నీలో విజయంతో ఛాంపియన్గా నిలవాలనే కుతూహలంతో కనిపిస్తోంది. క్వార్టర్స్లో చైనాకు చెందిన ఎనిమిదో సీడ్ హి బింగ్జియావోను ఢీకొట్టనుంది. గతంలో రెండుసార్లు బింగ్జియావోతో తలపడినా సింధు ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది.

విరామానికి 11-8తో ఆధిక్యం చాటి
బుసానన్తో జరిగిన తొలిగేమ్లో ఆదినుంచే సింధు జోరుగా ఆడింది. విరామ సమయానికే 11-4 స్కోరుతో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సింధు 21-12 తేడాతో అలవోకగా తొలిగేమ్ సొంతం చేసుకుంది. ఇక రెండోగేమ్లోనూ సింధు 4-0తో ఆధిక్యం అందకున్నా.. వరుసగా ఏడు పాయింట్లు సాధించిన బుసానన్ 7-4తో ఆధిక్యంలో కి దూసుకెళ్లింది. అంతేకాదు విరామానికి 11-8తో ఆధిక్యం చాటిన సింధు..21-15 స్కోరుతో రెండోగేమ్తోపాటు మ్యాచ్ సొంతం చేసుకుంది.

అద్భుతమైన ఫామ్తో దూసుకెళ్తున్న కిదాంబి శ్రీకాంత్
పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ కూడా అద్భుతమైన ఫాంతో దూసుకెళుతున్నాడు. రెండోరౌండ్లో టామీ సుగియార్తోతో జరిగిన మ్యాచ్లో తొలిగేమ్లో 10-21 తేడాతో ఓడినా మళ్లీ శ్రీకాంత్ పుంజుకున్నాడు. రెండో గేమ్లో విజయంతో మ్యాచ్లో ఆసక్తిని పెంచిఏన శ్రీకాంత్..మూడోగేమ్నూ సునాయాసంగా గెలిచి టోర్నీలో క్వార్టర్స్ చేరాడు. 2014 ఏడాదిలో చైనా ఓపెన్ గెలుచుకున్న శ్రీకాంత్ మరోసారి టైటిల్ విజేతగా నిలవాలని ఆశిస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చై టియాన్ చెన్తో తలపడనున్నాడు.

క్వార్టర్స్కు చేరిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి
పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 16-21, 21-14, 21-15తో వాహ్యూ నాయకా ఆర్య-యూసుఫ్ సంతోసో (ఇండోనేసియా) జోడీపై గెలిచి క్వార్టర్స్కు చేరింది. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంట 19-21, 21-15, 17-21తో షిహో తనాకా-కొహరు యోనెమోటో (జపాన్) జోడీ చేతిలో ఓడింది.


Click it and Unblock the Notifications












