
హైదరాబాద్: బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. శనివారం ఆమె లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాప్ట్ తేజస్ యుద్ధ విమానంలో గగనతలంలో విహరించారు. బెంగళూరు ఎయిర్ షోలో మహిళల దినోత్సవం సందర్భంగా ఏవియేషన్ అధికారులు సింధుకు ఈ అవకాశం కల్పించారు.
ఏవియేషన్ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ షోలో శనివారం పలు కార్యక్రమాలను చేపట్టింది. దానిలో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది.
ఎయిర్ షో అనంతరం తేజస్లో విహరించినందుకు చాలా సంతోషంగా ఉందని పీవీ సింధు తెలిపారు. తేజస్ యుద్ధ విమానాన్ని బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించిన సంగతి తెలిసిందే.