
ప్రిక్వార్టర్స్కు సింధు
మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు మన దేశానికే చెందిన శ్రీకృష్ణ ప్రియపై 21-5, 21-16 తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రిక్వార్టర్స్లోకి సింధు అడుగుపెట్టింది. తొలి సెట్ను 21-5తో సునాయసంగా గెలుచుకున్న సింధుకు రెండో సెట్లో మాత్రం శ్రీకృష్ణ ప్రియ పోటీ ఇచ్చింది. అయితే సింధునే చివరికి పై చేయి సాధించింది. దీంతో సింధు 21-16తో సెట్తోపాటు మ్యాచ్ను కూడా కైవసం చేసుకుంది.

శ్రీకాంత్ శుభారంభం
పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ భారత్కే చెందిన సిరిల్ వర్మపై 21-17, 21-10 తేడాతో విజయం సాధించాడు. తద్వారా శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్కు చేరుకున్నాడు. శ్రీకాంత్కు తొలి సెట్లో సిరిల్ వర్మ మంచి పోటీనే ఇచ్చాడు. అయితే సెట్ను శ్రీకాంత్ 21-17తో గెలుచుకున్నాడు. ఇక సెకండ్ సెట్ను శ్రీకాంత్ ఏకపక్షంగా ముగించాడు. ఈ సెట్ను 21-10 తేడాతో సునాయసంగా గెలుచుకున్నాడు. మరో మహిళల సింగిల్స్ మ్యాచ్లో భారత్కే చెందిన అష్మిత చాలియా 24-22, 21-16 తేడాతో రష్యాకు చెందిన ఐదో సీడ్ ఎవగెనియా కొసెత్స్కాయా పై సంచలన విజయం నమోదు చేసింది. తద్వారా ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లింది.

డబుల్స్లో భారత్ శుభారంభం
మహిళల డబుల్స్ తొలి రౌండ్లో భారత్కు చెందిన గాయత్రి గోపీచంద్-త్రిషా జాలీ జంట 21-12, 21-10 తేడాతో ఉక్రెయిన్కు చెందిన ప్రొజొరోవా-రుదకోవా జంటపై నెగ్గి ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించింది. రెండు సెట్లలోనూ భారత జంట సునాయసంగా విజయం సాధించింది.
ఇక మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో భారత్కు చెందిన గాయత్రి గోపీచంద్-సాయిప్రతీక్ జంట 21-16, 16-21, 21-17తో భారత్కే చెందిన ఇషాన్ భట్నాగర్-తనీషా క్రాస్టో జోడిపై విజయం సాధించింది. భారత్కు చెందిన సిక్కి రెడ్డి-ధ్రువ్ కపిల 21-11, 21-11 తేడాతో భారత్కే చెందిన చిరాగ్ అరోరా-నిషు రాప్రియా గెలుపొంది ప్రీక్వార్టర్స్లోకి అడుగుపెట్టింది.


Click it and Unblock the Notifications












