హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భాగంగా జరిగిన మ్యాచ్ల్లో బుధవారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మొదటి రౌండ్లో స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం సాధించగా, సైనా నెహ్వాల్ ఓటమి చవిచూసింది.
నాలుగో సీడ్గా బరిలోకి దిగిన పీవీ సింధు ఇండోనేషియా క్రీడాకారిణి దినార్ అయుస్టీన్పై 21-8, 21-18 తేడాతో విజయం సాధించింది. గతేడాది రియో ఒలింపిక్స్ అనంతరం పీవీ సింధు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది.
మరోవైపు ఏడో సీడ్గా బరిలోకి దిగిన భారత క్రీడాకారిణి సైనా తొలి రౌండ్లో జపాన్ క్రీడాకారిణి సయాక సాటో చేతిలో 21-19, 16-21, 18-21 తేడాతో ఓటమి పాలైంది. దీంతో తొలి రౌండ్లోనే సైనా నెహ్వాల్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇక పురుషుల సింగిల్స్ విషయానికి వస్తే అజయ్ జయరాం 21-18, 18-21, 21-19తేడాతో చైనా క్రీడాకారుడు తియాన్పై విజయం సాధించి రెండో రౌండ్కి దూసుకెళ్లాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రణవ్-సిక్కిరెడ్డి జోడీ 15-21, 21-14, 16-21తేడాతో చైనా జోడీ జెంగ్-చెన్ చేతిలో ఓటమి పాలైంది.