హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మాజీ విజేత, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి బ్యాడ్మింటన్లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆదివారం ఛండీగడ్లో ముగిసిన అండర్-19 ఆలిండియా బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ తరఫున పోటీ పడిన గాయత్రి, మహారాష్ట్రకి చెందిన పుర్వా బర్వేని 21-18, 23-21పై విజయం సాధించింది.
26 ఏళ్ల క్రితం (1991) ఇదే టోర్నీ మొదటిసారి నిర్వహించినపుడు గాయత్రి తల్లి, గోపీచంద్ భార్య పీవీవీ లక్ష్మి జూనియర్స్ విభాగంలో టైటిల్ సాధించింది. ఇక, అండర్-19 బాలుర డబుల్స్ ఫైనల్లో తెలంగాణకు చెందిన విష్ణువర్ధన్-శ్రీకృష్ణ జోడీ 18-21, 21-15, 21-13తో సంజయ్ శ్రీవత్స (పాండిచ్చేరి)-సిద్ధార్థ్ (తెలంగాణ) జంటపై నెగ్గి స్వర్ణం సాధించింది.
మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శ్రీకృష్ణ-సృష్టి జూపూడి (తెలంగాణ) ద్వయం 21-19, 21-15తో ఎడ్విన్-నఫీసా (కేరళ) జోడీపై విజయం సాధించింది. అండర్-17 బాలుర డబుల్స్ ఫైనల్లో బొక్కా నవనీత్-విష్ణువర్ధన్ (తెలంగాణ) జంట 20-22, 17-21తో ఎడ్విన్ జాయ్-అరవింద్ (కేరళ) జోడీ చేతిలో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది.
ఫైనల్స్ ఫలితాలు:
Girls' U-19 Singles: Gayatri Pullela Gopichand (TS) bt Purva Barve (MAH) 21-18, 23-21.
Girls' U-17 Singles: Malvika Bansod (MAH) bt Ritika Thaker (MAH) 21-7, 21-14.
Boys' U-19 Singles: Aman Farogh Sanjay (MAH) bt Abhishek Saini (HAR) 21-14, 21-18.
Boys' U-17 Singles: Aakash Yadav (DLI) bt Iman Sonowal (ASM) 21-16, 12-21, 21-16.