హైదరాబాద్: బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. హైదరాబాదులో జరుగుతున్న బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించడానికి రావాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రిని కోరారు. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్ పోటీలు హైదరాబాదులో జరుగుతాయి. ద్రోణాచార్య అవార్డు పొందినందుకు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గోపీచంద్ ను అభినందించారు.