
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప చిన్నారి ప్లేయర్లను ఆశ్చర్యపోయేలా చేశారు. ఈ ఇద్దరూ ముసలి వేషం వేసుకుని వచ్చి ఇప్పుడిప్పుడే బ్యాడ్మింటన్లో ఓటమాలు నేర్చుకుంటోన్న చిన్నారులను
కాసేపు ఆటపట్టించారు.
హైదరాబాద్లోని గరుడ బ్యాడ్మింటన్ అకాడమీ చిన్నారులతో తొలుత అసలు ఆట గురించే తెలియనట్లు నటించి, ఆ తర్వాత సూపర్ షాట్లు కొట్టి చిన్నారులను ఉత్సాహపరిచారు. కొద్దిసేపు ఆడిన అనంతరం వారి వేషం తీసి అక్కడున్న వారందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
వొడాఫోన్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్) 4వ సీజన్లో భాగంగా స్టార్ స్పోర్ట్స్ రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పీబీఎల్లో కిదాంబి శ్రీకాంత్ బెంగళూరు రాప్టర్స్ తరఫున ఆడుతుండగా, అశ్విని పొన్నప్ప అవధె వారియర్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తోంది.