
ఇండోనేసియా ఓపెన్లో చాంగ్పై ప్రణయ్ విజయం
సరిగ్గా నాలుగు నెలల క్రితం ఇండోనేసియా సూపర్ సిరిస్ ఓపెన్లో చాంగ్పై ప్రణయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గంటకుపైగా హోరాహోరీగా జరిగిన పోరులో ప్రణయ్ 21-17, 11-21, 21-19తేడాతో లీ చాంగ్పై విజయం సాధించాడు. మ్యాచ్ అనంతరం ప్రణయ్ మాట్లాడాడు.

రెండోసారి నెగ్గడం చాలా సంతోషంగా ఉంది
'లీ చాంగ్ వీపై వరుసగా రెండోసారి నెగ్గడం చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించకలిగే సత్తా ఉన్న ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లలో లీ చాంగ్ వీ ఒకడు. మ్యాచ్కు ముందు ఎవరితో ఆడుతున్నాను అన్న దాని గురించి పెద్దగా ఆలోచించను. టైటిల్ గురించి కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు. తదుపరి మ్యాచ్పైనే నా దృష్టి అంతా' అని ప్రణయ్ తెలిపాడు.

8వ సీడ్ కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్కు
మరోవైపు అన్సీడెడ్గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్, 8వ సీడ్ కిదాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్స్ చేరుకున్నారు. థాయ్లాండ్ క్రీడాకారిణి జిందాపాల్పై 22-20, 21-13తో సైనా నెహ్వాల్ విజయం సాధించగా... కొరియా క్రీడాకారుడు జియోన్ జిన్పై 21-13, 8-21, 21-18 తేడాతో కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు.

ఆరంభంలో కరోలినా మారిన్కు సైనా షాక్
కాగా, డెన్మార్క్ ఓపెన్లో అన్సీడెడ్గా బరిలో దిగిన సైనా నెహ్వాల్ ఒలింపిక్ ఛాంపియన్, స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో 22-20, 21-18తో మారిన్పై సైనా విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











