హైదరాబాద్ మూడో విజయం
పీబీఎల్లో హైదరాబాద్కు ఇది మూడో విజయం కావడం విశేషం. నార్త్ ఈస్టర్న్ వారియర్స్ ఆడిన గత మూడు మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమైన సైనా ఈసారి బరిలోకి దిగింది. మూడో మ్యాచ్గా జరిగిన మహిళల సింగిల్స్లో సింధు 11-15, 15-9, 15-5తో సైనాను ఓడించింది.
మిక్స్డ్ డబుల్స్లో ఓటమి
అంతకముందు జరిగిన మిక్స్డ్ డబుల్స్లో కిమ్ సా రంగ్, హై వన్ జోడీ 8-15, 14-15తో కిమ్ మిన్ చున్, లీ (వారియర్స్) చేతిలో ఓడిపోయింది. అయితే, వారియర్స్ ‘ట్రంప్' మ్యాచ్లో లీ హున్ 10-15, 15-13, 15-9తో సెన్సోమ్ బున్సుక్ను ఓడించడంతో హైదరాబాద్ ఆధిక్యంలోకి వచ్చింది.
సైనాపై సింధు విజయం
ఆ తర్వాతి మ్యాచ్లో పీవీ సింధు (హైదరాబాద్) 11-15, 15-9, 15-5తో సైనాపై గెలిచింది. దీంతో హైదరాబాద్ ఆధిక్యం 2-0కు పెరిగింది. నాలుగో మ్యాచ్ను వారియర్స్ ట్రంప్ మ్యాచ్గా ఎంచుకుని ఓటమిపాలైంది. కాల్జౌ 15-11, 15-14తో హోవీ (వారియర్స్)పై నెగ్గాడు. దీంతో హైదరాబాద్ ఆధిక్యం 4-0కు చేరింది.
పురుషుల డబుల్స్లోనూ హైదరాబాద్ విజయం
ఐదో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్లో ఇసారా-కిమ్ సా రంగ్ ద్వయం 15-10, 12-15, 15-14తో లియావో మిన్ చున్-యోన్ సెంగ్ యూ (వారియర్స్) జోడీని ఓడించడంతో హైదరాబాద్ 5-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగే మ్యాచ్లో ఢిల్లీ డాషర్స్తో బెంగళూరు రాప్టర్స్ తలపడనుంది.