For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెరిసిన సింధు: భార్యతో కలిసి మ్యాచ్ వీక్షించిన సచిన్

పీబీఎల్లో చెన్నై స్మాషర్స్ బోణీ చేసింది. తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ చేతిలో ఓటమిపాలైన చెన్నై మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు బ్లాస్టర్స్‌ను 5-0 తేడాతో చిత్తుచేసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో చెన్నై స్మాషర్స్ బోణీ చేసింది. తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ చేతిలో ఓటమిపాలైన చెన్నై మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు బ్లాస్టర్స్‌ను 5-0 తేడాతో చిత్తుచేసింది. మంగళవారం ముంబైలో జరిగిన పోరులో స్టార్ షట్లర్ పీవీ సింధు చెన్నై విజయంలో ముఖ్య భూమిక పోషించింది.

ముందుగా పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌ 11-8, 11-5తో సౌరభ్‌ వర్మపై విజయం సాధించాడు. కశ్యప్ అనుభవం ముందు సౌరభ్ వర్మ నిలబడలేకపోయాడు. ఆ తర్వాత తమ 'ట్రంప్‌' మ్యాచ్‌లో స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు 12-10, 11-6తో చెంగ్‌ గాన్‌ యీని ఓడించింది. బెంగళూరు ప్లేయర్ చెంగ్‌ గాన్‌ యీను వరుస సెట్లలో మట్టికరిపించింది.

తొలి సెట్‌ను 12-10తో కైవసం చేసుకున్న సింధు

తొలి సెట్‌ను 12-10తో కైవసం చేసుకున్న సింధు

తొలి గేమ్‌ మొదట్లో వెనుకబడ్డ సింధు ఆ తర్వాత కసిగా పుంజుకుని వరుస పాయింట్లు కొల్లగొట్టింది. పదునైన స్మాష్‌లకు తోడు డ్రాప్ షాట్లు, నెట్‌గేమ్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. అయితే చెంగ్‌ గాన్‌ యీ కూడా ధీటుగా ఆడటంతో గేమ్ హోరాహోరీగా సాగింది. చివరకు తొలి సెట్‌ను 12-10తో సింధు కైవసం చేసుకుంది.

రెండో గేమ్‌లో సింధు దూకుడు

రెండో గేమ్‌లో సింధు దూకుడు

ఇక రెండో గేమ్‌లో సింధు పూర్తిగా తన దూకుడుని ప్రదర్శించింది. చెంగ్‌ గేమ్‌పై ఓ అవగాహనకు వచ్చిన సింధు ఆమె బలహీనతలను సొమ్ముచేసుకుంటూ అలవోకగా పాయింట్లు దక్కించుకుంది. ఇలా 11-6తో రెండో గేమ్‌ను దక్కించుకున్న సింధు చెన్నైకి విజయాన్ని అందించింది.

అశ్వినీ పొన్నప్ప, యిహాన్ సంగ్‌పై విజయం

అశ్వినీ పొన్నప్ప, యిహాన్ సంగ్‌పై విజయం

ఆ తర్వాత జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో పోరులో చెన్నై ద్వయం గాబ్రియెల్ అడ్‌కాక్, క్రిస్ అడ్‌కాక్ 11-6, 8-11, 15-14తో అశ్వినీ పొన్నప్ప, యిహాన్ సంగ్‌పై విజయం సాధించింది. దాంతో చెన్నై స్మాషర్స్‌ ఆధిక్యం 3-0కు పెరిగింది. మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ విక్టర్ అక్సెల్‌సన్ 11-7, 13-11 టామీ సుగియార్తిపై విజయం సాధించాడు.

క్రిస్‌ అడ్‌కాక్‌, మ్యాడ్స్‌ పీలర్‌ చేతిలో పరాజయం

క్రిస్‌ అడ్‌కాక్‌, మ్యాడ్స్‌ పీలర్‌ చేతిలో పరాజయం

అయితే ఈ మ్యాచ్‌ ద్వారా సాధించిన ఒక పాయింట్‌ను కూడా బ్లాస్టర్స్‌ ఆ తర్వాత కోల్పోయింది. చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌‌లో ఆ టీమ్‌ ‘ట్రంప్‌'గా బరిలోకి దిగిన సుంగ్‌ హున్‌ కో, యూ యోన్‌ తీవ్రంగా పోరాడినా చివరకు 7-11, 11-7, 11-13 స్కోరుతో క్రిస్‌ అడ్‌కాక్‌, మ్యాడ్స్‌ పీలర్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.

పీబీఎల్ మ్యాచ్‌కి భార్యతో వచ్చిన సచిన్

పీబీఎల్ మ్యాచ్‌కి భార్యతో వచ్చిన సచిన్

రెండో పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ మినహా మిగతా నాలుగు మ్యాచ్‌లను ఆ జట్టు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇదే తొలి విజయం. బుధవారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌తో ముంబై రాకెట్స్‌ ఆడుతుంది. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌లకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి హాజరయ్యారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+