
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్లో చెన్నై స్మాషర్స్ దూసుకుపోతోంది. పీవీ సింధు సారథ్యంలోని చెన్నై స్మాషర్స్ట్ ప్రీమియర్ లీగ్ బ్యాడ్మింటన్లో సెమీఫైనల్కు చేరువైంది. సోమవారం సొంతగడ్డపై నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ ఆడిన చెన్నై 3-2 ఆధిక్యంతో బెంగళూరు బ్లాస్టర్స్ను ఓడించింది.
తమ ట్రంప్ మ్యాచ్తోపాటు ప్రత్యర్థి ట్రంప్ మ్యాచ్ను కూడా నెగ్గడం చెన్నై విజయావకాశాలను రెట్టింపు చేసింది. తొలుత బెంగళూరు ట్రంప్ మ్యాచైన పురుషుల డబుల్స్లో యాంగ్ లీ-సుమిత్ రెడ్డి జోడీ 8-15, 15-14, 15-13తో బెంగళూరు జంట బే-రంగ్ను ఓడించింది.
ఆ తర్వాత చెన్నై ట్రంప్ మ్యాచైన మహిళల సింగిల్స్లో సింధు 15-9, 15-14తో గ్లిమోర్ను చిత్తుచేసి తన జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్లో బెంగళూరు షట్లర్ అక్సెల్సన్ అద్వితీయంగా ఆడి సేన్సాబున్సాక్పై గెలిచాడు.
ఇంకో సింగిల్స్లో శుభాంకర్ గట్టి పోటీతో లెవెర్డెజ్ను ఓడించింది. , మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి, రంగ్ 15-14, 15-11 తేడాతో అడ్కాక్, సింధుపై నెగ్గినా బెంగళూరుకు ఫలితం లేకపోయింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.