హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లో అవధె వారియర్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన పోరులో వారియర్స్ 4-3తో చెన్నై స్మాషర్స్పై విజయం సాధించింది. తొలుత పురుషుల డబుల్స్ను అవధె వారియర్స్ ట్రంప్ మ్యాచ్గా ఎంచుకుంది.
ఈ మ్యాచ్లో లీ యంగ్-క్రిస్టియన్సెన్ జోడీ 15-8, 15-6తో క్రిస్ అడ్కాక్-సుమిత్ రెడ్డి జోడీపై అలవోక విజయం సాధించింది. దీంతో అవధె వారియర్స్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్లో లీ డాంగ్ కూన్ 15-7, 15-13తో చోంగ్ వీ ఫెంగ్పై గెలిచి అవధెకు 3-0 ఆధిక్యం అందించాడు.
మహిళల సింగిల్స్ను చెన్నై ట్రంప్ మ్యాచ్గా తీసుకోగా సంగ్ జి హ్యూన్ 15-13, 15-8తో జాంగ్పై నెగ్గి 2పాయింట్లు అందించింది. దీంతో అవధె వారియర్స్ ఆధిక్యం 3-2కు తగ్గింది. ఆ తర్వాత మిక్స్డ్లో అడ్కాక్-గాబ్రియెల్ 15-13, 15-9, 15-14తో మథియా్స-అశ్విని పొన్నప్పపై గెలిచి స్కోరును 3-3తో సమం చేశారు.
నిర్ణయాత్మక పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్లో మాజీ నెంబర్వన్ సన్ వా న్ హో 15-6, 15-6తో రాజీవ్ ఔసె్ఫపై నెగ్గి జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా, టోర్నీలో ఇప్పటికే ముంబై రాకెట్స్, హైదరాబాద్ హంటర్స్ సెమీస్కు చేరిన సంగతి తెలిసిందే. మంగవారం బెంగళూరు రాప్టర్స్తో ముంబై రాకెట్స్ తలపడుతుంది.