
మిక్స్డ్ డబుల్స్లో లీ చూక్- కిమ్ జోడీ 15-12, 9-15, 15-14 తేడాతో సుమీత్ రెడ్డి- జెస్సికాపై నెగ్గి వారియర్స్కు శుభారంభం అందించింది. ఇక పురుషుల సింగిల్స్లో లీ చూక్ 15-12, 15-12తో టామీపై విజయం సాధించి ఆధిక్యాన్ని మరింత పెంచాడు. చెన్నై ట్రంప్ మ్యాచ్గా ఎంచుకున్న పురుషుల డబుల్స్లో అవధె ఆటగాళ్లు బోడిన్- కృష్ణప్రసాద్ 15-13, 14-15, 15-10తో సుమీత్రెడ్డి- ధ్రువ్ కపిల జంటకు షాకిచ్చారు. ఈ గెలుపుతో మ్యాచ్ వారియర్స్ సొంతమైంది.
అప్పటికే ఫలితం తేలడంతో మిగిలిన నామమాత్రమైన పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్ మ్యాచ్లు నిర్వహించలేదు. శనివారం బెంగళూరు రాప్టర్స్, పుణె 7 ఏసెస్ మధ్య జరిగే సెమీస్ విజేతతో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ ఫైనల్లో తలపడనుంది.
డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ చివరి లీగ్ మ్యాచ్లో 5-0తో అవధె వారియర్స్పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల సింగిల్స్లో బ్రైస్ లెవెర్డెజ్, తై జు యింగ్ నెగ్గి బెంగళూరును ఆధిక్యంలో నిలిపారు. 'ట్రంప్' మ్యాచ్లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ విజయం సాధించడంతో బెంగళూరు రాప్టర్స్ రెండు 'ట్రంప్' మ్యాచ్ల్లోనూ గెలిచి సెమీస్కు వెళ్లే అవకాశాన్ని సులభతరం చేసుకుంది.
సెమీఫైనల్ పోరు:
# బెంగళూరు vs పుణె (శనివారం)