|
సింధు విజయం
దీంతో ఢిల్లీ 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్ను హంటర్స్ ‘ట్రంప్' మ్యాచ్గా ఎంచుకోగా సింధు 15-11, 15-9తో కొసెట్స్కయా (ఢిల్లీ)పై విజయం సాధించి ఆధిక్యాన్ని 2-3కు తగ్గించింది. ఆ తర్వాత రెండో పురుషుల సింగిల్స్లో సుగియార్తో (ఢిల్లీ) 15-6, 15-11తో గాల్జౌను ఓడించడంతో 4-2తో డాషర్స్ విజయం ఖాయమైంది.
|
25 పాయింట్లతో అవధె వారియర్స్
చివరగా మిక్స్డ్ డబుల్స్లో కిమ్ స రంగ్-ఇయోమ్ (హైదరాబాద్) జంట 15-7, 15-12తో వాంగ్ సిజి- చియా సిన్ లీ జోడీపై గెలిచింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో అవధె వారియర్స్ 5-0తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్పై విజయం సాధించింది. దీంతో 25 పాయింట్లతో అవధె వారియర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
|
బీవెన్ జాంగ్ చేతిలో సైనా ఓటమి
అవధె ట్రంప్గా ఎంచుకున్న మ్యాచ్లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టు కెప్టెన్ సైనా నెహ్వాల్ 15-11, 11-15, 7-15తో బీవెన్ జాంగ్ చేతిలో ఓడింది. టోర్నీలో మొత్తంగా 11 పాయింట్లే సాధించిన నార్త్ ఈస్టర్న్ ఇంటి ముఖం పట్టింది. తొలి మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో లి డాంగ్ కియున్ 15-10, 15-13తో టియాన్ హోవీపై గెలిచి అవధెకు పాయింట్ అందించాడు.
|
ట్రంప్ మ్యాచ్లో సైతం
ఆ తర్వాత ట్రంప్గా ఎంచుకున్న మిక్స్డ్ డబుల్స్లో అశ్విని పొన్నప్ప-క్రిస్టిన్సెన్ జోడీ 15-7, 15-14తో లియో మిన్ చున్-కిమ్ హ నపై నెగ్గి 3-0 ఆధిక్యాన్ని సాధించింది. పురుషుల రెండో సింగిల్స్లో నార్త్ ఈస్టర్న్ ప్లేయర్ తియాంగస్ క సయూన్సోమ్బుక్ 15-8, 15-10తో సన్ వాన్ హోపై నెగ్గాడు. చివరి మ్యాచ్లో యాంగ్ లి-అర్జున్ జోడీ 15-5, 15-12తో ధ్రువ్ కపిల్-యు యాన్ సియాన్పై నెగ్గింది.
|
పీబీఎల్లో గురువారం
బెంగళూరు రాప్టర్స్ Vs చెన్నై స్మాషర్స్ (రాత్రి 7 నుంచి)