హైదరాబాద్: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరిస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ సంచలం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో కశ్యప్ వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారుడు చెన్ లాంగ్ను ఓడించి సెమీస్కు చేరాడు.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో పారుపల్లి కశ్యప్ 14-21, 21-17, 21-14తో చైనా అగ్రశ్రేణి షట్లర్ చెన్ లాంగ్ను ఓడించాడు. 63 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ ఓడినా, వరుస రెండు గేముల్లో విజయం సాధించాడు.
వరల్డ్ ఛాంపియన్ చెన్ లాంగ్పై కశ్యప్ రెండో సారి విజయం సాధించాడు. అంతక ముందు గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రపంచ 12వ ర్యాంకర్ కశ్యప్ 21-11, 21-14తో ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో (కొరియా)పై గెలిచాడు.