
న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్-300 టోర్నమెంట్లో భారత స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రణయ్ 21-14, 21-12తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై సంచల విజయం సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రణయ్ స్థానం 26లో ఉండగా.. సుగియార్తో 13వ ర్యాంకులో ఉన్నాడు. ఇది క్వార్టర్స్లో సునెయామా (జపాన్)తో ప్రణయ్ తలపడనున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మరో యువ ఆటగాడు భమిడిపాటి సాయి ప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ప్రణీత్ 12-21, 12-21తో చైనా ఆటగాడు లిన్డాన్ చేతిలో పరాజయం పొందాడు. ఇక పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మను అత్రి (భారత్) జోడి 17-21, 19-21తో గో వి షెమ్-తాన్ వి కియోంగ్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.