ఫిజియోథెరపీ అవసరం: మాక్య్క్యూర్లో సెంటర్ను ప్రారంభించిన గుత్తా జ్వాల
హైదరాబాద్: మాదాపూర్లోని మ్యాక్స్క్యూర్ ఆస్పత్రిలో కొత్తగా ఫిజియోథెరపీ సెంటర్ను శుక్రవారం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, ఎమ్మెల్యే డికె అరుణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా జ్వాల మాట్లాడుతూ.. ప్రజలకు ఫిజియోథెరపీపై అవగాహన కల్పించాలన్నారు.
అరుణ మాట్లాడుతూ.. రోగులు తొందరగా కోలుకోవడానికి ఫిజియోథెరపీ ఎంతో అవసరమని అన్నారు. ముఖ్యంగా మహిళలు వివిధ రకాల వంటి నొప్పులతో బాధపడుతున్నారని, వారికి ఈ థెరపీ సరైన చికిత్స అని అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికాలున్న ఈ ఆస్పత్రిని ఐటి కారిడార్లో ఏర్పాటు చేయడం శుభసూచకమని అన్నారు.
ఆస్పత్రి ఎండి అనీల్ కృష్ణ మాట్లాడుతూ.. ఏడాది క్రితం ఏర్పాటు చేసిన తమ ఆస్పత్రికి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మంజుల, రాహుల్ అగర్వాల్, ప్రేమ్ చంద్, కృష్ణకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications