మలేషియా రాజధాని కౌలాలంపూర్లోని ఆక్సియాటా ఎరీనాలో జరుగుతున్న మలేషియా మాస్టర్స్ - 2022 టోర్నీలో భారత షట్లర్లు ముందడుగు వేస్తున్నాడు. మలేషియా సూపర్ సిరీస్ 500అని పేర్కొనే ఈ టోర్నీ 13వ ఎడిషన్ ఇది. గతేడాది కరోనా వల్ల ఈ టోర్నీని నిర్వహించలేదు. జులై 5, జులై 6వ తేదీల్ల క్వాలిఫికేషన్ అయి తొలి రౌండ్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. తర్వాత రెండో రౌండ్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్, ఫైనల్స్ జరుగుతాయి. జులై 10న టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా 88సింగిల్స్ ప్లేయర్లు పాల్గొంటుండగా.. 108డబుల్స్ జట్లు పాల్గొంటున్నాయి. భారత బృందంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్, అశ్విని పొన్నప్ప, ఎస్ రెడ్డి తదితర స్టార్ షట్లర్లు మలేషియా మాస్టర్స్ 2022లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మొదటి రౌండ్లో భారత షట్లర్ పి.సాయి ప్రణీత్ విజయం సాధించాడు.
అతను బుధవారం 21-8, 21-9 వరుస సెట్లలో గ్వాటెమాలాకు చెందిన కెవిన్ కార్డన్ను ఓడించాడు. రెండో రౌండ్కు అతను అర్హత సాధించాడు. భారత ఆటగాడు సమీర్ వర్మ తన తొలి పురుషుల సింగిల్స్ పోరులో తైవాన్కు చెందిన చౌ టియన్-చెన్తో ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇక మరో స్టార్ పారుపల్లి కశ్యప్ 21-16, 16-21, 21-16తో ఇండోనేషియా వెటరన్ టామీ సుగియార్టోపై డ్రామాటిక్ మ్యాచ్లో విజయం సాధించి రెండో రౌండ్కు చేరుకున్నాడు. హీ బింగ్ జియావోపై పీవీ సింధు అద్భుత విజయం సాధించింది. ప్రెజర్ పాయింట్లలో అద్భుతమైన ఫామ్ ప్రదర్శించి హీ బింగ్ జియావోను 13-21, 21-17, 15-21 తేడాతో ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మంగళవారం మాళవిక బన్సోద్ ఓడిపోయింది. భారత జోడీ ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ పుల్లెల తొలి రౌండ్లోనే ఓడిపోయారు. ఇంకా హెచ్ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఇకపోతే ఈ మ్యాచ్ ఫైనల్ విజేతలకు 3,60,000 డాలర్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. మలేషియా మాస్టర్స్ 2022 టోర్నమెంట్ క్వార్టర్-ఫైనల్ నుంచి Sports18 ఛానెల్లో, Voot Select యాప్లో ప్రసారం అవుతుంది