ఇంచియాన్: కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్ 2019లో పారుపల్లి కశ్యప్ మినహా భారత షట్లర్లందరూ బుధవారమే నిష్క్రమించారు. అయితే కశ్యప్పై భరత్ పెట్టుకున్న అంచనాలను అతడు చేరుకునే దిశగా మరో అడుగు ముందుకేశాడు. పారుపల్లి కశ్యప్ కొరియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ మ్యాచ్లో మలేసియా ఆటగాడు డారెన్ లియూపై 21-17, 11-21, 21-12 తేడాతో విజయం సాధించాడు.
శిఖర్ ధావన్ను అవమానించలేదు.. ప్రేమ, ఆనందం, వినోదం మాత్రమే!!
దాదాపు గంట (56 నిమిషాలు) పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి గేమ్ను 21-17తో సొంతం చేసుకున్న కశ్యప్.. రెండో గేమ్లో 11-21తో పూర్తిగా తడబడ్డాడు. ఇక మూడో గేమ్లో పుంజుకున్న కశ్యప్.. లియూపై 21-12తో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ విజయంతో కశ్యప్ క్వార్టర్ ఫైనల్స్కి చేరాడు. కశ్యప్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో ఇండోనేసియాకు చెందిన ఆంటోనీ సినిసుకాతో తలపడనున్నాడు. అంతకుముందు ప్రిక్వార్టర్స్లో 21-16, 21-16తో లు చియా హుంగ్ (చైనీస్ తైపీ)పై వరుస గేముల్లో విజయం సాధించాడు. కొరియా ఓపెన్ నుండి అందరూ నిష్క్రమించడంతో కశ్యప్పైనే భారత్ నమ్మకం పెట్టుకుంది.
గతవారం చైనా ఓపెన్లో నిరాశపరిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కొరియా ఓపెన్లోనూ పేలవ ఫామ్ కొనసాగించింది. ఈ టోర్నీలో తొలిరౌండ్లోనే వెనుదిరిగింది. మహిళల సింగిల్స్లో ఐదో సీడ్ సింధు బుధవారం జరిగిన తొలి రౌండ్లో 21-7, 22-24, 15-21 తేడాతో అనామక ప్లేయర్ బివాన్ జంగ్ (అమెరికా) చేతిలో పరాజయం చెందింది.
పతకంపై ఆశలు పెట్టుకున్న భారత షట్లర్లు సాయి ప్రణీత్, సైనా నెహ్వాల్లను గాయాలు దెబ్బతీశాయి. పురుషుల సింగిల్స్లో తొలి రౌండ్లో ఐదో సీడ్ ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో మ్యాచ్లో సాయి ప్రణీత్ 9-21, 7-11తో ఉన్న సమయంలో కాలి మడమ గాయం కారణంగా వైదొలిగాడు. మహిళల సింగిల్స్లో కిమ్ గా ఉన్ (దక్షిణ కొరియా)తో మ్యాచ్లో సైనా నెహ్వాల్ 21-19, 18-21, 1-8తో ఉండగా గాయంతో తప్పుకుంది.
పురుషుల డబుల్స్లోనూ భారత్కు నిరాశే ఎదురైంది. తొలి రౌండ్ పోరులో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం 19-21, 21-18, 18-21తో నాలుగో సీడ్ తకేషి కముర-కిగో సొనొడ (జపాన్) జోడీ చేతిలో.. మను అత్రి-సుమిత్ రెడ్డి జోడీ 16-21 21-19, 18-21తో క్వాలిఫయర్స్ హ్యూంగ్ కై జియాంగ్-లియు చెంగ్ (చైనా) జంట చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.