హైదరాబాద్: బ్యాంకాక్లో నేటి నుంచి జరుగనున్న థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ వైదొలిగారు. భారత స్టార్ క్రీడాకారులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ థాయ్లాండ్ ఓపెన్ టైటిల్పైనే ఆశలు పెట్టుకున్న ఇండియాకు నిరాశ తప్పలేదు. గతేడాది అద్భుత విజయాలతో దూసుకెళ్ళిన భారత స్టార్లు ఈ సీజన్లో ఇప్పటిదాకా ఖాతా తెరవలేదు! థాయ్లాండ్ ఓపెన్లోనైనా భారత క్రీడాకారుల టైటిళ్లు సాధించగలరా అనే సందేహం నెలకొంది.
ఫలితంగా భారత ఆశలన్నీ ప్రణయ్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, పీవీ సింధులపైనే ఉన్నాయి. జూలై 10 మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో లిండా జెచిరి (బల్గేరియా)తో రెండో సీడ్ సింధు, బుసానన్ (థాయ్లాండ్)తో ఐదో సీడ్ సైనా నెహ్వాల్, సయాక సాటొ (జపాన్)తో వైష్ణవిరెడ్డి తలపడతారు. పురుషుల సింగిల్స్ టాప్ సీడ్ షై యుకి (చైనా)తో పారుపల్లి కశ్యప్, పాబ్లో ఎబియన్ (స్పెయిన్)తో ప్రణయ్, తనోంగ్సక్ (థాయ్లాండ్)తో సమీర్వర్మ పోటీపడతారు.
పురుషుల డబుల్స్లో సుమీత్రెడ్డి- మను అత్రి, సాత్విక్ సాయిరాజు- చిరాగ్ శెట్ట¨, తరుణ్- సౌరభ్శర్మ, అర్జున్- రామచంద్రన్.. మహిళల డబుల్స్లో మేఘన- పూర్విష, సంయోగిత- ప్రజక్త.. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్- అశ్విని పొన్నప్ప, సౌరభ్శర్మ- అనుష్క బరిలో ఉన్నారు.
తొలి రోజు క్వాలిఫయింగ్ విభాగంలో మ్యాచ్లు జరుగుతాయి. బుధవారం మెయిన్ 'డ్రా' మ్యాచ్లు మొదలవుతాయి. సింగిల్స్ క్వాలిఫయింగ్లో భారత్ తరఫున రాహుల్ యాదవ్, శ్రేయాన్‡్ష జైస్వాల్, కార్తికేయ గుల్షన్ కుమార్, చుక్కా సాయి ఉత్తేజిత రావు బరిలోకి దిగనున్నారు.