హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ను డిప్యూటీ కలెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇటీవల పద్మశ్రీ అందుకున్న శ్రీకాంత్ గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. శ్రీకాంత్ను డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు శ్రీకాంత్కు అందజేశారు.
ఈ సందర్భంగా ఇటీవల పద్మశ్రీ అందుకున్న కిదాంబి శ్రీకాంత్కు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ కూడా పాల్గొన్నారు.